కాంగ్రెస్ పార్టీలోకి పెరుగుతున్న వలసలు... లైన్‌లో మరో ముగ్గురు?

సెల్వి

బుధవారం, 20 మార్చి 2024 (10:15 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్ కీలక నేతల వలసలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో రహస్యంగా చర్చలు జరుపుతున్నారని టాక్ వస్తోంది. కాంగ్రెస్ శిబిరం నుండి సానుకూల సంకేతాలు వస్తే భవిష్యత్తులో వారు ఎప్పుడైనా పార్టీ మారవచ్చు.

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పటాన్‌చెరుకు చెందిన గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్‌కు చెందిన కె.మాణిక్‌రావు, సంగారెడ్డికి చెందిన చింతా ప్రభాకర్ అని తెలుస్తోంది. 
 
ఈ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ తదుపరి గమ్యస్థానం కాంగ్రెసేనని అభిప్రాయపడుతున్నారని, ఇందుకోసం కాంగ్రెస్ నేతలతో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు