బైకుపై వచ్చిన ముగ్గురు.. బాలుడిపై కత్తితో దాడి చేశారు.. ఎందుకు? (video)

సెల్వి

శుక్రవారం, 18 అక్టోబరు 2024 (18:13 IST)
Boy
హైదరాబాద్, కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్జీ మండి ప్రాంతంలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పవన్ అనే బాలుడిపై కత్తితో దాడి చేశారు. దాడి జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో పవన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దాడికి పాల్పడిన వారి వివరాలు, దాడి వెనుక గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైందని, అధికారులు ఆధారాలు సేకరించేందుకు పరిశీలిస్తున్నారు.

A shocking incident took place in the Subzi Mandi area under the jurisdiction of the Kulsumpura Police Station, Hyderabad.pic.twitter.com/MfPWikz8E9

— The Munsif Daily (@munsifdigital) October 18, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు