భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యే గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినథ్యం వహిస్తున్న ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నెల 5వ తేదీన గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు.
ఈ నెల 5వ తేదీన గోపీనాథ్ గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయినట్టు గుర్తించి, సీపీఆర్ చేశారు. ఆ తర్వాత ఆయన గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించి, నాడి, రక్తపోటు సాధారణ స్థాయికి చేరడంతో ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు.
కాగా, గోపీనాథ్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మూడు నెలల క్రితం కూడా ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చేరి డయాలసిస్ చేయించుకున్నారు. తాజాగా ఆయనకు గుండెపోటు రావడంతో మళ్లీ మృతి చెందారు.