14 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం.. ఎక్కడంటే..?

సోమవారం, 19 ఏప్రియల్ 2021 (09:56 IST)
కరోనా ఓవైపు జనాలకు చుక్కలు చూపిస్తుంటే.. కామాంధుల దుశ్చర్యలు ఏమాత్రం ఆగట్లేదు. దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మహిళలపై వయోభేదం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా మైనర్ బాలికపై మరో మైనర్ బాలుడు లైంగికదాడికి పాల్పడాడు. ఈ ఘటనపై ఖమ్మం జిల్లా రఘునాథపాలెం పోలీసు స్టేషన్ లో ఆదివారం రాత్రి కేసు నమోదు అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. రఘునాథపాలెం మండలానికి చెందిన ఓ 14 ఏండ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 16 ఏండ్ల బాలుడు శనివారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లగా ఒంటరిగా ఉండటం గుర్తించి ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి తిరిగి వచ్చిన తండ్రికి బాలిక విషయం చెప్పింది. దీనిపై ఆయన ఫిర్యాదు మేరకు ఆదివారం రాత్రి కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు