కేసీఆర్ ఊఁ.. అంటే చాలు.. 300 కిమీ లోతుకు తొక్కేస్తాం : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

గురువారం, 19 ఆగస్టు 2021 (17:41 IST)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అధికార తెరాస పార్టీ నేతలు గట్టివార్నింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కనుసైగ చేస్తే చాలు రేవంత్ రెడ్డిని 300 కిలోమీటర్ల లోతుకు తొక్కేస్తాం అంటూ తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ తెలంగాణ ద్రోహి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా బహిరంగసభలో రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడారని అన్నారు. నిరుద్యోగులకు, మహిళలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని చెప్పారు. మహిళల రుణాలకు రూ.200 కోట్ల వడ్డీ చెల్లించామని తెలిపారు. ఇప్పటివరకు లక్షా 26 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.
 
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు భూమిలో పాతి పెట్టారని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రంలో సోనియా రాజ్యం వచ్చే పరిస్థితే లేదన్నారు. 2009లో పొత్తు వల్లే రేవంత్ గెలిచారని... కేసీఆర్ వల్లే రేవంత్‌కు టీపీసీసీ ఉద్యోగం వచ్చిందని అన్నారు. కేసీఆర్ ఆదేశిస్తే రేవంత్ ను 300 కిలోమీటర్ల లోతుకు తొక్కుతామని ఆయన హెచ్చరించారు 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు