20 సార్లు చెప్పిన ఆ మోడీ గా(డి)రికి... అబ్బా కేసీఆర్ అనేశారు...

మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (15:02 IST)
అలవాట్లో పొరపాట్లు సహజమే. నోరు అదుపు తప్పితే తేడా కొట్టేస్తుంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంలో దొర్లిన చిన్న తప్పు ఇప్పుడు నెట్లో దుమారం రేపుతోంది. ఆయన నిన్న ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలంటూ హితవు పలికారు. 
 
ఈ క్రమంలో ఆయన మాటల్లో పుసుక్కున ఓ అక్షరం తేడా కొట్టింది. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రధానమంత్రి మోడీ గారికి అనబోయి మోడీ గాడికి అనేసారు. 20 సార్లు ప్రధానమంత్రిని కలిసి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. మోదీ గురించి కేసీఆర్ మాట్లాడిన సమయంలో కొందరు చప్పట్లు కొట్టారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఏదేమైనప్పటికీ తప్పు దొర్లిపోయింది... అది కాస్తా నెట్లో చెక్కెర్లు కొడుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు