వచ్చే ఎన్నికల్లో వైఎస్. షర్మిల పోటీ చేస్తే స్థానం ఇదే...

బుధవారం, 14 డిశెంబరు 2022 (18:22 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల వచ్చే యేడాది తెలంగాణాలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆమె బుధవారం వెల్లడించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఇందులోభాగంగా, ఈ నెల 16వ తేదీన పాలేరులో పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం భూమి పూజ జరుగుతుందని తెలిపారు. ఆ రోజున పార్టీ విధానాలను వెల్లడిస్తామని తెలిపారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణాలో రాజన్న రాజ్యాన్ని తెలంగాణాలో ఏర్పాటు చేయడమే లక్ష్యంగా షర్మిల పాదయాత్ర చేపట్టిన విషయం తెల్సిందే. ఈ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చినా.. రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. 
 
ఆమె పిటిషన్‌ను విచారించిన కోర్టు.. పాదయాత్రకు అనుమతి ఇస్తూనే కొన్ని షరతులు విధించింది. రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని వ్యక్తిగత విమర్శలు చేయకూడదన్న నిబంధన విధించింది. అలాగే, హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని షర్మిల నివాసం వద్ద ఉంచిన బారికేడ్లను తొలగించాలని ఆదేశించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు