బాలకృష్ణ వందో సినిమాపై వెలువడుతున్నవార్తలు హాట్ టాపిక్గా మారాయి. బాలయ్య వందో సినిమా కావడంతో సినీ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ''గౌతమీపుత్ర శాతకర్ణి'' కథతో తెరకెక్కనున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ తెరకెక్కించనున్న ఈ చారిత్రక సినిమాలో నటీనటులతో పాటు, సాంకేతికంగానూ ఈ సినిమాని వైవిధ్యభరితంగా చూపేందుకు దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట.