నటుడు నరేశ్ మాజీ భార్య రమ్యపై కేసులు నమోదు

మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (17:40 IST)
Naresh family
సీనియ‌ర్ న‌రేశ్ వేల‌ కోట్లాధిప‌తి. త‌న త‌ల్లి విజ‌య‌నిర్మ‌ల నుంచి వ‌చ్చిన ఆస్తులు ఆమె మ‌న‌వ‌ళ్ళ‌కు, న‌రేశ్ కు రాసిచ్చేసింది. ఇక న‌రేశ్ ఆస్తులతోపాటు వైవాహిక జీవితంలోనూ కొత్త ఒర‌వ‌డి సృష్టించాడు. న‌రేశ్ రెండో భార్య ర‌మ్య ర‌ఘుప‌తిపై కొంద‌రు మ‌హిళ‌లు పోలీసుకేసు పెట్టారు. గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ ఈ కేసు న‌మోదైంది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న న‌రేశ్ ఆమెకూ త‌న‌కూ ఎటువంటి సంబంధం లేద‌నీ, ఆమెపై వ‌స్తున్న ఆర్థిక లావాదేవీల గురించి త‌న‌కేమీ తెలియ‌ద‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు పోలీసు వ‌ర్గాలు తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం. 
 
ర‌మ్య‌పై ఐదుగురు మ‌హిళ‌లు కేసు పెట్టార‌ట‌. గ‌త కొద్దికాలం నాడు ఇదే త‌ర‌హాలో  శిల్పా చౌదరి కేసు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆమె సినిమా ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖ హీరో కుటుంబీకులు ఆమె ఉచ్చులో ప‌డ్డారు. మహేశ్ బాబు చెల్లెలు ప్రియదర్శిని కూడా శిల్ప బాధితురాలే. ఇక కొత్త‌గా ర‌మ్య చేసిన ఆ ర్థిక లావాదేవీల‌న్నీ ఆంధ్ర‌లోనే జ‌ర‌గ‌డం విశేసం. అయితే న‌రేశ్ పేరు అడ్డం పెట్టుకుని చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. పైగా ర‌మ్య మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె కావ‌డంతో ఆమె ప‌నులు ఈజీ అయిపోయాయి. ర‌మ్య హైదరాబాద్, అనంతపూర్, హిందూపూర్‌లో భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై త్వ‌ర‌లో ఆంధ్ర‌లోని ప్రాంతాల‌ను ప‌ర్య‌టించి ఫైన‌ల్‌గా ఓ నిర్ణ‌యానికి రానున్న‌ట్లు పోలీసు వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయ‌ని వార్త ఫిలింన‌గ‌ర్‌లో వినిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు