నాలుగేళ్లలో 10 వేల మందిని కలిశాను: అనుపమా పరమేశ్వరన్

శనివారం, 28 జులై 2018 (14:57 IST)
అనుపమ పరమేశ్వరన్. కేరళలో పుట్టిన అనుపమ తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. సినీ పరిశ్రమలోకి అనుపమ పరమేశ్వరన్ కాలు పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతోంది. సినీ పరిశ్రమలోకి వచ్చినప్పుడు ఎంతో భయమేసింది. కెమెరా ముందు నటించాలంటే సిగ్గేసింది. అందులోను వందలమంది చుట్టుప్రక్కల ఉంటే వారిని చూస్తూ యాక్టింగ్ చేయడం కష్టమనిపించింది. మొదట్లో ఎన్నో టేక్‌లు చేసేదాన్ని. 
 
కానీ ఇప్పుడు కెమెరా ముందు నటించడం చాలా ఈజీగా అనిపిస్తోంది. అంతేకాదు నేను సినీపరిశ్రమకు వచ్చినప్పటి నుంచి 10 వేల మంది నాతో పరిచయం పెట్టుకున్నారు. అందరూ సినిమా యూనిట్ సభ్యులే. నాకు పరిచయమైన వారు నాతో కుటుంబసభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. తమిళం, కన్నడ పరిశ్రమల కన్నా తెలుగు సినీపరిశ్రమ అంటే నాకు చాలా బాగా ఇష్టం. తెలుగువారు చూపించే ప్రేమ, వారు ఇచ్చే గౌరవం అంటే నాకు చాలా ఇష్టమని చెబుతోంది అనుపమా పరమేశ్వరన్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు