వెండితెర 'వైఎస్సార్' పక్కన సన్నీలియోన్ కూర్చుంది.. వైరల్..

మంగళవారం, 29 జనవరి 2019 (17:50 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బయోపిక్‌ ''యాత్ర''లో నటిస్తున్న మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి.. ప్రస్తుతం నెటిజన్ల నుంచి సెటైర్లు ఎదుర్కొంటున్నారు. తాజాగా మమ్ముట్టి నటించిన మదురై రాజా అనే సినిమాలో ఓ పాటలో ఐటమ్ డ్యాన్స్ చేసింది.. సన్నీలియోన్. ప్రస్తుతం మధురై రాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
సన్నీలియోన్‌పై ఐటమ్ సాంగ్ దృశ్యాలను షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ స్పాట్‌లో మమ్ముట్టి చెంతనే సన్నీలియోన్ కూర్చుని వుండే ఫోటో లీకైంది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసిన వారంతా మమ్ముట్టిపై సెటైర్లు వేస్తున్నారు. జోకులు పేలుస్తున్నారు. 
 
అలాగే సన్నీలియోన్ సరసన మీరు కూర్చోవడం ఏమిటి అంటూ కేరళ ఫ్యాన్స్ మమ్ముట్టికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో మమ్ముట్టి సోదరుడిగా జర్నీ స్టార్ జై నటిస్తున్నాడు. 
 
ఈ చిత్రానికి వ్యాసఖ్ దర్శకత్వం వహిస్తుండగా.. అను శ్రీ, షమ్నా ఖాసిమ్, అన్నా రేష్మా, మహిమా నంబియార్, జగపతి బాబు, సిద్ధీఖీ, నేదుముడి వేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం మమ్ముట్టి 2010లో నటించిన పోకిరి రాజాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు