సైరా ప్రమోషన్‌కి ఎగ్గొట్టినా వోగ్ ఫోటో షూట్‌, విజయ్ 'బిగిల్' కోసం నయనతార జిగేల్

గురువారం, 17 అక్టోబరు 2019 (20:54 IST)
సైరా ప్రమోషన్‌కి నయనతార రాలేదన్న విషయం చర్చనీయాంశమైంది. ఐతే నయనతార తను ఏది అనుకుంటుందో దాన్ని మాత్రమే చేస్తుందనీ, మరొకరు చెప్పినదాన్ని ఎంతమాత్రం వినదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆమె వోగ్ పత్రిక కోసం ఫోటో షూట్ చేసింది. అలాగే తమిళ హీరో విజయ్ చిత్రం బిగిల్ చిత్రం ఇంకా విడుదలే కాలేదు కానీ ఆ చిత్రం కోసం నయనతార సైన్యం ఇప్పటి నుంచే ప్రమోషన్ మొదలుపెట్టింది.
 
ఇకపోతే సైరా నరసింహా రెడ్డి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నటించింది. ఈ చిత్రం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కాబట్టి చిత్రం ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందోనన్న భయంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ చేసుకునేందుకు ఎవరికివారు చాలా కష్టపడ్డారు. 
 
ముఖ్యంగా తమన్నా ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రమోషన్ కోసం వస్తూ చిత్ర విజయానికి ఎంతో కృషి చేసారని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి పొగడ్తల జల్లు కురిపించారు. తమన్నా సైరా చిత్రాన్ని తన సొంత చిత్రంగా భావించి ప్రమోషన్ కోసం వచ్చిందంటూ కితాబిచ్చారు. మరో హీరోయిన్ నయనతార గురించి మాత్రం పెదవి విరిచారు. 

 

PhotoShoot Session for Vogue India

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు