తమిళంలో పాగా కోసం పాట్లు : నిధి అగర్వాల్ ఆశలన్నీ గల్లంతు!

బుధవారం, 30 సెప్టెంబరు 2020 (18:05 IST)
తమిళంలో పాగా వేయాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటుంది. అలాగే, నిధి అగర్వాల్ కూడా ఆశపడింది. ఇందుకోసం తమిళ హీరోతో జతకట్టింది. జయం రవి హీరోగా నటించిన 25వ చిత్రం "భూమి". ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు ఎంతో ఎదురు చూశారు. కానీ, అక్టోబరు నెలలో కూడా తమిళనాట థియేటర్లు తెరుచుకోవడం లేదు. దీంతో ఓటీటీలో 'భూమి' చిత్రం విడుదల కానుంది. 
 
నిజానికి 'భూమి' సినిమా థియేటర్‌ విడుదల కోసం దర్శక నిర్మాతలు, హీరో జయం రవితో పాటు హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ చాలా ఆశగా ఇన్ని రోజులూ ఎదురుచూశారు. ముఖ్యంగా 'ఇస్మార్ట్‌' బ్యూటీ నిధి అగర్వాల్‌ 'భూమి' సినిమాపై చాలా ఆశలను పెట్టుకుంది. ఎందుకంటే ఈమె నటించిన తొలి తమిళ చిత్రమిది. 
 
చేతిలో అంతంత మాత్రమే అవకాశాలున్న తరుణంలో 'భూమి' సినిమాతో కోలీవుడ్‌లో పాగా వేయొచ్చని నిధి భావించింది. అయితే సినిమా ఓటీటీలోనే విడుదలవుతుంది. ఈ విషయంలో ఆమె చేసేదేమీ లేదు. 'భూమి' విషయంలో అనుకున్నదొకటైతే అయ్యిందొకటంటూ.. నిధి అగర్వాల్‌ అసంతృప్తిగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
కాగా, ఈ అమ్మడు తెలుగులో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చింది. అందులో ఒకటి అక్కినేని అఖిల్ నటించిన 'మజ్ను' చిత్రం కాగా, రామ్ పొత్తినేని నటించి 'ఇస్మార్ట్' ఒకటి. ఇందులో ఇస్మార్ట్ సూపర్ డూపర్ హిట్ అయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు