ఈ కల్తీ మద్యం తయారీ కేసులో సంబంధం ఉన్నట్టు తేలిన తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి, స్థానిక టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ఆదివారం రాత్రి ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
అలాగే, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. పార్టీ అధినేత నారా చంద్రబాబ నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. నకిలీ మద్యం తయారీ కేసులో జయచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాజేష్, సన్నిహితుడు జనార్ధన్ రావు, సమీప బంధువుల పాత్ర ఉన్నట్టు నిర్ధారణ కావడంతో వారి ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై టీడీపీ అధిష్టానం చర్యలు చేపట్టింది.