ఔను... ఆమెతోనే వుంటున్నా, నా భార్యతో కాదు: థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ 'బత్తాయి' పృథ్వీ

మంగళవారం, 28 జూన్ 2022 (13:23 IST)
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగుతో పాపులర్ అయిన సీనియర్ కమెడియన్ పృథ్వీ గురించి తెలియనివారుండరు. రాజకీయాల్లోకి రాకముందు హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ జోరుగా వుండేవారు. కానీ వైసిపీ తీర్థం పుచ్చుకుని ఎస్వీబీసి ఛానల్ ఛైర్మన్ పగ్గాలు పట్టాక ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అవికాస్తా పూర్తి డ్యామేజ్ చేసాయి.


అంతకుముందు పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శనాస్త్రాలు సంధించడంతో సినిమాల్లో ఛాన్సులు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆయన చేతిలో అంతగా సినిమాలు లేవని హైదరాబాద్ సినీజనం చెప్పుకుంటున్నారు.

 
ఇదిలావుంటే తన లైఫ్ గురించి ఓ సీక్రెట్ పృథ్వీ బయటపెట్టారు. అదేంటంటే... తన భార్యతో వచ్చిన విభేదాల కారణంగా ఆమెను వదిలేసినట్లు వెల్లడించాడు. తన భార్యాపిల్లల్ని వదిలేసి ఎనిమిదేళ్లు దాటిపోయిందనీ, అప్పట్నుంచి తను మరో మహిళతో కలిసి వుంటున్నట్లు చెప్పాడు.

 
తను కష్టాల్లో వున్నప్పుడు ఆదుకున్నదనీ, ఆమె లేకపోతే తను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్పుకొచ్చాడు. ఆమె పేరు పద్మరేఖ అనీ, తన కష్టసుఖాల్లో ఆమె భాగస్వామి అనీ, ఆమె తనను ఆదుకోకపోతే పరిస్థితి ఎలా వుండేదో చెప్పలేనన్నారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు