చెర్రీ మూవీకి రూ.14 కోట్లు డిమాండ్ చేసిన కొరటాల శివ?

సోమవారం, 17 జులై 2017 (14:37 IST)
కొరటాల శివ... టాలీవుడ్‌లోని స్టార్ డైరెక్టర్లలో ఒకరు. వరుస విజయాలు ఆయన సొంతం. కథా రచయితగా తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి ఆ తర్వాత దర్శకుడిగా మారిన కొరటాల... ప్రభాస్ హీరోగా 'మిర్చి' చిత్రాన్ని తన దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
ఇపుడు మెగా హీరో రాంచరణ్‌తో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ .. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా, ఈ కాంబినేషన్‌లో ఈ సినిమా నిర్మితంకానుంది. ఈ సినిమా కోసం కొరటాల పారితోషికం రూ.14 కోట్లు డిమాండ్ చేసినట్టు ఫిల్మ్ నగర్‌ వర్గాల సమాచారం. వరుస హిట్స్‌తో పాటే కొరటాలకి డిమాండ్ పెరుగుతూ వచ్చిందనీ, అందుకే ఆయన పారితోషికం ఆ స్థాయిలో ఉందనే టాక్ వినిపిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి