బాలీవుడ్ భామే కావాలంటున్న టాలీవుడ్ హీరోలు! (video)

సోమవారం, 10 ఆగస్టు 2020 (11:57 IST)
తెలుగులో ఒకటి, రెండు చిత్రాలు చేసిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ. ముఖ్యంగా, రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించింది. కానీ, చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కియారా సూపర్బ్ రోల్ చేసింది. పైగా, మూవీ సూపర్ హిట్ కావడంతో కియారాకు మంచి పేరు కూడా వచ్చింది. మంచి అందంతో పాటు.. అభినయం ప్రదర్శించింది. 
 
ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీబిజీ తారగా మారిన కియారా.. టాలీవుడ్‌లో మంచి అవకాశం వస్తే చేయాలని చూస్తుంది కానీ.. అస్సలు ఆమెకు అంత టైమ్ ఇవ్వడం లేదు బాలీవుడ్. అయితే ఎలాగైనా ఆమెను టాలీవుడ్‌లోకి తీసుకురావాలని మన స్టార్ హీరోలు, డైరెక్టర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు.  
 
ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్‌తో 'ఆచార్య' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. చరణ్ సరసన ఎట్టి పరిస్థితుల్లోనూ కియారాను తీసుకు రావాలని కొరటాల గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
అలాగే మహేష్ బాబు 'సర్కారు వారి పాట'కు కూడా ఫస్ట్ చాయిస్ కియారానే అనుకున్నారు. మొత్తంగా చూస్తే.. కియారాను టాలీవుడ్‌కు రప్పించాలని గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని చెప్పవచ్చు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు