లెక్చరర్‌గా వెంకీ, ఇంతకీ ఏ సినిమాలో..?

సోమవారం, 19 అక్టోబరు 2020 (13:05 IST)
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. వెంకీ సరసన ప్రియమణి నటిస్తుంది. ఈ సినిమా ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కరోనా కారణంగా రిలీజ్ కాలేదు. ఈ సినిమా తర్వాత వెంకీ.. ఎఫ్ 3 మూవీ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.
 
ఇదిలా ఉంటే... వెంకీతో తరుణ్ భాస్కర్ ఓ మూవీ చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ.. ఎప్పుడు..? అనేది క్లారిటీ లేదు.
 
 ఈ ప్రాజెక్ట్ గురించి తాజా వార్త ఏంటంటే... ఇప్పటికే తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్‌‌ను పూర్తి చేశాడు. తాజాగా ఫుల్ స్క్రిప్ట్ విన్న వెంకీ మరియు సురేష్ బాబు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. కాకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ తరువాత ఉంటుందని తెలిసింది.
 
ఈ సినిమా కాలేజీ నెపథ్యంలో సాగుతుందని, వెంకీ లెక్చరర్‌గా నటించబోతున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. చాలా వరకు సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందట. వెంకీ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. సుందరకాండ సినిమాలో లెక్చరర్‌గా నటించాడు వెంకీ.
 
 మళ్లీ ఇప్పుడు లెక్చరర్‌గా నటిస్తున్నాడుని తెలిసి ఫ్యాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన సురేష్‌ బాబు ఈ సినిమాని నిర్మించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు