రాజమండ్రి పరిసరాల్లో 1920 భీమునిపట్నం

డీవీ

సోమవారం, 18 మార్చి 2024 (17:27 IST)
Kancharla Upendra Aparnadevi
కంచర్ల ఉపేంద్ర  అపర్ణాదేవి  హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం  "1920 భీమునిపట్నం".. అవార్డు చిత్రాల దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ  చిత్రం చిత్రీకరణ రాజమండ్రి పరిసరాల్లో జరుపుకుంటోంది. ఈ మధ్యనే రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ ను ప్రాంభించుకుని, అక్కడే పది రోజులపాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం యూనిట్ రాజముండ్రికి వెళ్లి, అక్కడి పరిసరాల్లో హీరో,హీరోయిన్ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
 
ఈ సందర్భంగా  నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, "రాజమండ్రిలో కూడా పది రోజుల పాటు షూటింగ్ జరుపుతాం. . హీరో, హీరోయిన్ల పై గోదావరి నేపథ్యంలో సన్నివేశాలను తీయడం జరుగుతోంది. ఈ చిత్రంలోని సీతారాం, సుజాత పాత్రల మధ్య నడిచే  ప్రేమకధను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. కథానుసారం సంగీతం, ఫోటోగ్రఫీ చిత్రానికి ప్రాణంగా నిలుస్తాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటం  ఓ హైలైట్. రాజముండ్రి తర్వాత విశాఖపట్నం, అరకు, ఊటీలలో కూడా చిత్రీకరణ జరుపుతాం" అని చెప్పారు.
 
దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, "భారత స్వతంత్ర పోరాట నేపథ్యంలో చక్కటి భావోద్యేగాల మధ్య నడిచే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. పాత్రలన్నీ సహజసిద్ధంగా ఉంటాయి. నిజ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రేరణగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వ పోలీస్ అధికారి పాత్రలో హీరో కంచర్ల ఉపేంద్ర నటిస్తుండగా, స్వాతంత్ర సమరయోధుడి కుమార్తె పాత్రలో హీరోయిన్ అపర్ణా దేవి కనిపిస్తారు" అని అన్నారు. .
 
హీరో కంచర్ల ఉపేంద్ర, హీరోయిన్ అపర్ణాదేవి మాట్లాడుతూ, "అద్భుతమైన పీరియాడికల్ చిత్రంలో నటించే అవకాశం అరుదుగా లభిస్తుంటాయి. ఎందుకంటే అలాంటి కథ, దానిని అదే స్థాయిలో తెరకెక్కించగల దర్శకుడు, రాజీపడకుండా, అభిరుచి కలిగిన నిర్మాత కలయికలోనే ఈ తరహా చిత్రం వస్తుంది. కెరీర్ మొదట్లోనే అలాంటి చిత్రంలో నటించడం మా అదృష్టం అని" చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు