రాజమండ్రిలో రోడ్డు భద్రతా అవగాహన ప్రచారం నిర్వహించిన హోండా మోటర్‌సైకిల్ ఇండియా

ఐవీఆర్

బుధవారం, 31 జనవరి 2024 (18:27 IST)
ప్రతి వ్యక్తి యొక్క భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఉంటుందని హెచ్‌ఎంఎస్‌ఐ అభిప్రాయపడింది. రోడ్డు భద్రతపై అవగాహన లక్షలాది మంది పౌరులకు చేరేలా చేసేందుకు, దేశంలోని వివిధ ప్రాంతాలలో తరచూ రోడ్డు భద్రత అవగాహన ప్రచారాలను సంస్థ నిర్వహిస్తోంది. అటువంటి ప్రచారం ఇటీవల రాజమండ్రి నగరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. భాష్యం పబ్లిక్ స్కూల్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా హెచ్‌ఎంఎస్‌ఐ అపూర్వమైన మైలురాయిని సాధించింది. ఇక్కడ అది 2100 కంటే ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులు, సిబ్బంది సభ్యుల క్రియాశీల భాగస్వామ్యాన్ని చూసింది. ఈ ప్రచారంలో భాగంగా స్లోగన్ రైటింగ్, పోస్టర్ మేకింగ్ పోటీ, రోడ్ సేఫ్టీ క్విజ్, ఆర్టికల్ రైటింగ్ కాంపిటీషన్ వంటి కార్యకలాపాలను నిర్వహించారు. 
 
పిల్లలే ఈ సమాజానికి భవిష్యత్తు అని హెచ్‌ఎంఎస్‌ఐ బలంగా విశ్వసిస్తోంది. రోడ్డు భద్రతపై ప్రాథమిక దశలోనే వారికి అవగాహన కల్పించడం వల్ల రోడ్డు ప్రమాదాలు లేకుండా చేయడంలో దోహదపడుతుందని నమ్ముతుంది. ఇది తరచూ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పిల్లల నుండి యువత వరకు అనేక రకాల వయస్సు వర్గాలకు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
 
ప్రారంభం నుండి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, హెచ్‌ఎంఎస్‌ఐ దాదాపు 2 లక్షల మంది పెద్దలు, పిల్లలకు రోడ్డు భద్రతా విద్యను అందించింది, బాధ్యతాయుతమైన రహదారి వినియోగాన్ని ప్రోత్సహించడం, సురక్షితమైన రైడింగ్ అలవాట్లను పెంపొందించడంపై దృష్టి సారించింది.
 
రోడ్డు భద్రత పట్ల హోండా మోటర్‌సైకిల్ & స్కూటర్ ఇండియా యొక్క సీఎస్ఆర్ నిబద్ధత:
2021 సంవత్సరంలో, హోండా ప్రపంచవ్యాప్తంగా 2050 సంవత్సరానికి ఒక విజన్ స్టేట్‌మెంట్‌ను చేసింది, దీని ప్రకారం హోండా మోటర్‌సైకిల్స్, ఆటోమొబైల్స్‌కు సంబంధించిన వాహనాలతో జీరో ట్రాఫిక్ ఢీకొన్న మరణాల కోసం ప్రయత్నిస్తుంది. 2030 నాటికి మరణాలను సగానికి తగ్గించాలనే భారత ప్రభుత్వ లక్ష్యంకు అనుగుణంగా భారతదేశంలో హెచ్‌ఎంఎస్‌ఐ ఈ లక్ష్యంతో పని చేస్తోంది.
 
ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఒక కీలకమైన అంశం ఏమిటంటే, 2030 నాటికి మన పిల్లల్లో రోడ్డు భద్రత పట్ల సానుకూల ఆలోచనను పెంపొందించడం, ఆ తర్వాత కూడా వారికి ఆ విద్యను కొనసాగించడం. పాఠశాలలు, కళాశాలల్లో రహదారి భద్రత విద్య ద్వారా అవగాహన కల్పించడమే కాకుండా యువతలో భద్రతా సంస్కృతిని పెంపొందించడం, వారిని భద్రతా అంబాసిడర్‌గా మార్చడం చేయనుంది. ఇది భవిష్యత్ తరాలను బాధ్యతాయుతంగా మార్చడానికి, సురక్షితమైన సమాజానికి గణనీయంగా దోహదపడేలా చేస్తుంది.
 
ఈ సమాజం తప్పని సరిగా వుండాలని కోరుకునే సంస్థగా నిలువాలని హెచ్‌ఎంఎస్‌ఐ కోరుకుంటుంది, పాఠశాల పిల్లల నుండి కార్పొరేట్లు మరియు సమాజం వరకు ప్రతి విభాగానికి ప్రత్యేకమైన ఆలోచనలతో సమాజంలోని అన్ని వర్గాలకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తోంది. హెచ్‌ఎంఎస్‌ఐ యొక్క నైపుణ్యం కలిగిన భద్రతా బోధకులు భారతదేశంలో హెచ్‌ఎంఎస్‌ఐ దత్తత తీసుకున్న 10 ట్రాఫిక్ శిక్షణా పార్కులు (TTP), 6 సేఫ్టీ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ సెంటర్‌లలో (SDEC) సమాజంలోని ప్రతి భాగానికి రహదారి భద్రత విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి రోజువారీ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే 5.7 మిలియన్ భారతీయులకి చేరుకుంది. దీని ద్వారా నేర్చుకోవడాన్ని సరదాగా, శాస్త్రీయంగా  హెచ్‌ఎంఎస్‌ఐ యొక్క జాతీయ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం  చేసింది. 
 
శాస్త్రీయంగా రూపొందించబడిన లెర్నింగ్ మాడ్యూల్: హోండా యొక్క నైపుణ్యం కలిగిన బోధకులు రహదారి చిహ్నాలు & గుర్తులు, రహదారిపై డ్రైవర్ విధులు, రైడింగ్ గేర్ & భంగిమ వివరణ, సురక్షితమైన సవారీ మర్యాదలపై థియరీ సెషన్‌లతో పునాదిని ఏర్పాటు చేశారు.
 
ప్రాక్టికల్ లెర్నింగ్: హోండా యొక్క వర్చువల్ రైడింగ్ సిమ్యులేటర్‌పై ఒక ప్రత్యేక శిక్షణా కార్యకలాపం వాస్తవ రైడింగ్‌కు ముందు రోడ్డుపై 100 కంటే ఎక్కువ ప్రమాదాలను అనుభవించడం కోసం అమలు చేయబడింది.
 
ఇంటరాక్టివ్ సెషన్: పాల్గొనేవారికి కికెన్ యోసోకు ట్రైనింగ్ (KYT) అని పిలిచే ప్రమాద అంచనా శిక్షణ ఇవ్వబడింది, ఇది ప్రమాదానికి రైడర్/డ్రైవర్ యొక్క సున్నితత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది మరియు రోడ్లపై సురక్షితమైన డ్రైవింగ్ ప్రవర్తనను నిర్ధారిస్తుంది.
 
ఇప్పటికే ఉన్న డ్రైవర్లు రైడింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుస్తారు: ఇప్పటికే ఉన్న రైడర్‌లుగా ఉన్న విద్యార్థులు & పాఠశాల సిబ్బంది సభ్యులు స్లో రైడింగ్ కార్యకలాపాలు మరియు ఇరుకైన పలకలపై సవారీ చేయడం ద్వారా వారి రైడింగ్ నైపుణ్యాలను పరీక్షించారు & మెరుగుపరుచుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు