చిక్కుల్లో నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌.. ఆ కేసులో నిందితురాలుగా ఈడీ గుర్తింపు

బుధవారం, 17 ఆగస్టు 2022 (15:15 IST)
బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ చిక్కుల్లో చిక్కుకుంది. మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెను ఈడీ నిందితురాలిగా పరిగణించింది. ఈ మేరకు ఈ కేసులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో ఆమె పేరును చేర్చింది. దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించామని ఈడీ వర్గాలు వెల్లడించాయి. 
 
ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ రూ.200 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్‌ పేరును ఈడీ నిందితురాలిగా పరిగణించింది. ప్రధాన నిందితుడైన సుకేశ్ నుంచి జాక్వెలిన్‌ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
 
అత్యంత ఖరీదైన డిజైనర్‌ బ్యాగులు, జిమ్‌ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్‌లెట్‌, మినీ కూపర్‌.. ఇలా దాదాపు రూ.10కోట్ల విలువైన కానుకలను జాక్వెలిన్‌, ఆమె కుటుంబసభ్యులకు సుకేశ్ ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు