బాహుబలి బాటలో పుష్ప.. కేజీఎఫ్-2తో పోటీ పడతాడా?

బుధవారం, 4 ఆగస్టు 2021 (11:23 IST)
బాహుబలి రెండు భాగాలు మంచి సక్సెస్ సాధించాయి. అయితే, ఇప్పుడు ఇదే బాటలో మరికొన్ని చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అందులో ఒకటి పుష్ప. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయం తీసుకుంది. మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రాబోతుంది. అంతేకాదు, దేశంలో పెద్ద హిట్‌గా నిలిచిన కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్‌-2తో పోటీ పడుతుంది. 
 
ఇక పుష్ప రెండో భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపిస్తుండగా, రష్మిక మంధన గిరిజన యువతిగా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో చిత్రీకరిస్తున్నారు. పుష్ప కూడా రెండు భాగాల్లో హిట్టయితే, మరికొన్ని చిత్రాలు కూడా అదే బాటలో నడవడం ఖాయమని చెప్పాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు