డిసెంబరు 20న `వంగ‌వీటి`కి హాజ‌ర‌వుతున్న అమితాబ్‌, నాగార్జున‌

శుక్రవారం, 9 డిశెంబరు 2016 (17:58 IST)
రామ్‌గోపాల్ వ‌ర్మ దర్శక‌త్వంలో రూపొందిన చిత్రం `వంగ‌వీటి`. రీసెంట్‌గా విజ‌య‌వాడ‌లో విడుద‌లైన పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో రెండు పాట‌ల‌ను ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మనే పాడారు. ఈ పాట‌ల‌కు, ఆ పాట‌ల సాహిత్యానికి మ్యూజిక్ ల‌వ‌ర్స్ నుండి మంచి అప్రిసియేష‌న్ వ‌స్తుంది. రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రూపొందిన ఈ సినిమాను డిసెంబ‌ర్ 23న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా డిసెంబ‌ర్ 20న హైద‌రాబాద్ జె.ఆర్‌.సి.క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో నిర్మాత దాసరి కిర‌ణ్‌కుమార్ భారీ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌కు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, కింగ్ నాగార్జున ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతున్నారు. ఓ బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ తెలుగు వేడుకకు ఇలా విచ్చేయ‌డం ఇదే ప్ర‌థ‌మం. బిగ్ బి, నాగార్జున వంటి స్టార్స్ ఈ వేడుక‌కు హాజ‌ర‌వుతుండ‌టంతో వంగ‌వీటిపై భారీ క్రేజ్ నెల‌కొంది.
 
బ్యానర్ః రామ‌దూత క్రియేష‌న్స్‌, ర‌చ‌యిత‌లుః చైత‌న్య‌ప్ర‌సాద్‌, రాధాకృష్ణ‌, సాహిత్యం: సిరాశ్రీ, చైత‌న్య‌ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీః రాహుల్ శ్రీవాత్స‌వ్‌, కె.దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి, ఎడిట‌ర్ః సిద్ధార్థ్ తాతోలు, మ్యూజిక్ః ర‌విశంక‌ర్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్స్ః మంజునాథ్‌, గౌత‌మ్ రాచిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః విస్సు, కో-ప్రొడ్యూస‌ర్ః సుధీర్ చంద్ర ప‌డిరి, నిర్మాతః దాస‌రి కిర‌ణ్‌కుమార్‌, ద‌ర్శ‌క‌త్వం: రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

వెబ్దునియా పై చదవండి