అలా చేయలేకే 'అర్జున్‌ రెడ్డి'తో నో చెప్పా : అనూ ఇమ్మాన్యుయేల్

సోమవారం, 29 అక్టోబరు 2018 (14:40 IST)
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. నిజానికి ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ను తీసుకోవాలని భావించారట. ఇదే విషయంపై ఆమె సంప్రదించగా ఆమె నిరాకరించింది. దీంతో ఆమె స్థానంలో రష్మిక మందన్నాను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో ఆమె పలికించిన హాహభావాలకు తెలుగు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 
 
ఈ కారణంగా అనూ ఖాతాలో ఓ ఖాతాలో హిట్ చేజారిపోయింది. దీనిపై అనూ స్పందిస్తూ, గీత గోవిందం సినిమాలో హీరోయిన్ ఆఫ‌ర్ మొద‌ట నా ద‌గ్గ‌ర‌కే వ‌చ్చింది. ఆ సినిమా క‌థ‌, హీరోయిన్ పాత్ర నాకు చాలా న‌చ్చాయి. అయితే అప్ప‌టికే 'నా పేరు సూర్య' సినిమా కోసం బ‌ల్క్ డేట్లు కేటాయించాను. దాంతో 'గీత గోవిందం' పాత్ర‌ను వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. అయినా ఆ సినిమాలో క‌నిపించాల‌నే ఉద్దేశంతో అతిథి పాత్ర‌లో న‌టించాన‌ని అనూ ఎమ్మాన్యుయేల్ వివరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు