అమూల్యకు తోడుగా బంటూ వచ్చినట్టున్నాడు: పూజా హెగ్దె ట్వీట్

బుధవారం, 28 ఏప్రియల్ 2021 (20:26 IST)
అలవైకుంఠపురం జోడీ అల్లు అర్జున్-పూజా హెగ్దె కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ నెల 25న పూజా హెగ్దెకి కరోనా సోకింది. దీనితో ఆమె హోం ఐసొలేషన్లోకి వెళ్లిపోయారు. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు.
 
ఇంతలో అల్లు అర్జున్ తనకు కరోనా సోకిందంటూ ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ ఎమోషన్ అయ్యారు. టేక్ కేర్ #Anna అనే ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలావుంటే అల్లు అర్జున్ చేసిన ట్వీట్ పైన పూజా హెగ్దె వెరైటీగా అల వైకుంఠపురం చిత్రంలోని పాత్రల పేర్లతో స్పందించారు.
 

Buntu seems to be giving Amulya company! Take care @alluarjun Sending you some healing light and energy you’ll be healthy in no time!

— Pooja Hegde (@hegdepooja) April 28, 2021
బంటూ(అల్లు అర్జున్ పాత్ర పేరు) అమూల్య(పూజా పాత్ర పేరు)కు తోడుగా వుండేందుకు వచ్చినట్లున్నాడు. జాగ్రత్తగా వుండండి అల్లు అర్జున్, ఈ ట్వీట్ తో మీకు నేను కొంచెం శక్తిని పంపిస్తున్నాను. నువ్వెప్పుడూ బాగానే వుంటావు అని ట్వీట్ చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు