ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ ప్రస్తుత నటీనటులపై ఫైర్ అయ్యారు. ప్రస్తుత హీరోలు ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్లా ఫీల్ అవుతున్నారని, సీనియర్ ఆర్టిస్టులను ఏ మాత్రం గౌరవించడం లేదని చంద్రమోహన్ తెలిపారు. ప్రస్తుతం సినిమాలు, ఫైట్లు, అశ్లీలత కామన్ కథలుగా మారిపోయాయని, కామెడీ పండటం లేదన్నారు.
రంగులరాట్నం, సువర్ణనంది చిత్రాలు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయని, ఆ నాటి మధురజ్ఞాపకాలను నేటికీ మరువలేనన్నారు. బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ చదివి 1962లో ఏలూరులోనే తనకు ఉద్యోగం వచ్చిందన్నారు.
ఏలూరులో సైకిల్పై తిరిగేవాడినని అప్పటి నుంచే అంబికా కుటుంబ సభ్యులతో అనుబంధం ఉందని.. వారి ఇంటిలో ఏ శుభకార్యాలు జరిగినా తాను తప్పకుండా హాజరవుతానని తెలిపారు. ఆ రోజుల్లో సినిమా వంద రోజులు ఆడితే గొప్ప అని, ఇప్పుడు కేవలం రెండు వారాలకే సినిమాలు మారిపోతున్నాయని చంద్రమోహన్ చెప్పారు.