ఇదిలా వుండగా అల్లుఅరవింద్ సమక్షంలో బేబి నిర్మాత ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ, ఛానల్ మీడియాపై అసహనాన్ని వ్యక్తం చేశారు. కొన్ని పైరసీ వెబ్సైట్లలో ప్రింట్ వచ్చిందనీ, ఈరోజు కాపీ వచ్చేసిందోచ్. అంటూ పబ్లిష్ చేస్తున్నారు. ఇది మైయిన్ స్ట్రీమ్ కు సంబంధించిన వెబ్ సైట్ లో కూడా వార్త వచ్చేసిందోచ్. అనడంతో పాటు ఆహా, అమెజాన్ లో వచ్చేసింది.. చూడొచ్చు అనేది కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు అని అల్లు అరవింద్ సమక్షంలో చెబుతున్నాను. ఇలా వార్తలు రాసినవారే నైతిక భాద్యత వహించాలి అన్నారు.