బాలీవుడ్‌లో విషాదం.. 'ధూమ్' ఫేమ్ సంజయ్ గాధ్వి కన్నుమూత

ఆదివారం, 19 నవంబరు 2023 (16:40 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. స్టార్ దర్శకుడు "ధూమ్" ఫేమ్ సంజయ్ గాధ్వి మృతి చెందారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్టు గాధ్వి కుమార్తె వెల్లడించారు. మరో మూడు రోజుల్లో గాద్వి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాల్సివుంది. ఇంతలోనే ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. 
 
ఆదవారం ఉదయం 9.30 గంటలకు గాధ్వి కన్నుమూశారని కుమార్తె సంజీనా వెల్లడించారు. అయితే, ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవనీ, బహుశా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచివుంటారని అభిప్రాయపడ్డారు. 
 
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'ధూమ్', 'ధూమ్-2' వంటి చిత్రాలకు గాధ్వి దర్శకత్వం వహించారు. గాధ్వి వయసు 56 సంవత్సరాలు. ఆయన 2000లో "తేరే లియే' చిత్రంతో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. 2002లో "మేరే యార్ కి షాదీ హై' చిత్రంలో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. కేరీర్‌లో చివరగా 'ఆపరేషన్ పరిందే' చిత్రానికి దర్శక్తవం వహించగా, ఇది గత 2020లో విడుదలైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు