థ్యాంక్యూ వంశీ డార్లింగ్‌.. నీ లాంటి ఫ్రెండ్ ఉంటే ప్ర‌తిరోజూ పండగే

బుధవారం, 8 జనవరి 2020 (14:59 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న యువ దర్శకుల్లో మారుతి ఒకరు. ప్రతి చిత్రంలోని ఓ విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకుని చిత్రాలు నిర్మిస్తుంటాడు. తాజాగా ప్రతిరోజూ పండగే అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించగా, రాశీఖన్నా హీరోయిన్. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. 
 
క్రిస్మస్ పండగ సందర్భంగా ఈ చిత్రం విడుదలకాగా, సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్లపరంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈనేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు మారుతికి నిర్మాతల్లో ఒకరైన వంశీ ఓ కాస్ట్లీ గిఫ్టును బహుకరించాడు. 
 
ఇంత మంచి చిత్రం తీసినందుకు నిర్మాత వంశీ.. మారుతికి రేంజ్ రోవర్ కారు గిఫ్ట్‌గా అందించాడు. ఈ విష‌యాన్ని మారుతి సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు. థ్యాంక్యూ వంశీ డార్లింగ్‌.. నీ లాంటి ఫ్రెండ్ ఉంటే ప్ర‌తిరోజూ పండగే అని ట్వీట్ చేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు