శ్రీ సింహాకొడూరి తో - దొంగలున్నారు జాగ్రత్త

శనివారం, 18 సెప్టెంబరు 2021 (20:18 IST)
Dongalunnaru jagratta opening still
శ్రీ సింహా కొడూరి రెండు చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో న‌టుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం శ్రీ సింహా కొడూరి హీరోగా న‌టిస్తోన్న మూడ‌వ చిత్రం `దొంగలున్నారు జాగ్రత్త`. ఈ సినిమా షూటింగ్  శ‌నివారంనాడుప్రారంభ‌మైందని అధికారికంగా ప్ర‌క‌టించారు చిత్ర యూనిట్‌
 
చిత్రయూనిట్ సరైన అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల్లో ఒక ప్ర‌త్యేక‌మైన‌ ముద్ర వేశారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన‌ ప్రమోషనల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఓ మెమోరీ కార్డును దొంగిలించడం గురించి ఉంది. దాన్ని బట్టి సినిమా కథ ఏంటి? హీరో పాత్ర ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఇక ఈ వీడియోలోనే సాంకేతిక బృందాన్ని కూడా పరిచయం చేశారు.
 
సముద్రఖని లాంటి అద్భుతమైన నటుడు ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ బ్యానర్లపై సురేష్ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు సతీష్ త్రిపుర ద‌ర్శ‌కుడు.  రోహిత్ కులకర్ణి సంగీత దర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా యశ్వంత్ సీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.  గ్యారీ బీహెచ్ ఎడిటర్‌.
 
తారాగ‌ణం: శ్రీ సింహా కోడూరి, సముద్రఖని, ప్రీతి అస్రాని
సాంకేతిక వ‌ర్గం:
ప్రొడక్షన్ కంపెనీ: సురేష్ బాబు, గురు ఫిల్మ్స్, నిర్మాత: డి సురేష్ బాబు, సునిత తాటి, డైరెక్టర్: సతీష్ త్రిపుర, కెమెరామెన్: యశ్వంత్ సీ,  సంగీతం: రోహిత్ కులకర్ణి, ఆర్ట్:  గాంధీ నడికుడికర్, ఎడిటర్: గ్యారీ బీహెచ్, లైన్ ప్రొడ్యూసర్: డి రామ బాలాజీ, మార్కెటింగ్: లిపిక అల్ల.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు