"ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్" ముమ్మాటికీ మాదే.. డీవీవీ దానయ్య

ఠాగూర్

సోమవారం, 8 జనవరి 2024 (15:56 IST)
పవన్ కళ్యాణ్ హీరో సుజీత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "ఓజీ" (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తన సొంత బ్యానర్ డీవీవీ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే, ఇపుడు ఈ ప్రొడక్షన్ హౌస్ మారిందంటూ ప్రచారం సాగుతుంది. నిర్మాణ బాధ్యతలు మరో నిర్మాణ సంస్థ చేతికి వెళ్లాయంటూ ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ స్పందించింది.
 
"ఓజీ" మా సినిమా. ఎప్పటికీ మాదే. ఈ సినిమా ఉండబోతుందే మాకు స్పష్టత ఉంది. ఆ దిశగా ముందుకుసాగుతున్నాం. ఆకలితో ఉన్న చిరుత దేనిని వదిలిపెట్టదు" అంటూ ట్వీట్ చేసింది. ముంబై - జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుంది. పవన్ సరకన్ ప్రియాంకా మోహన్ నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. 
 
'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా? 
 
మహష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం "గుంటూరు కారం". ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన విడుదల కానుంది. దీన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇపుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించే వేడుక తేదీ, ప్రాంతాన్ని ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన గుంటూరులో భారీ స్థాయిలో ఈ  ప్రీ రిలీజ్ ఈవెంట్‌‍ను నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6వ తేదీన హైదరాబాద్ నగరంలో ప్లాన్ చేశారు. కానీ, పోలీసుల నుంచి అనుమతులు లభించకపోవడంతో 9వ తేదీకి వాయిదా వేశారు. 
 
గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్‌కు సమీపంలో భారత్ పెట్రోల్ బంకు పక్కన ఈ వేడుకను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభంకానుంది. మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రం 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. కాగా, ఆదివారం రాత్రి విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాలో మోత మోగిస్తుంది. కేవలం 12 గంటల వ్యవధిలోనే రెండున్నర కోట్ల వ్యూస్ సాధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు