సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకోవద్దు : మహేశ్ బాబు వినతి

ఠాగూర్

గురువారం, 3 అక్టోబరు 2024 (16:45 IST)
తమ స్వార్ధరాజకీయ ప్రయోజనాల కోసం సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకోవద్దని హీరో మహేశ్ బాబు అన్నారు. నాగ చైతన్య, సమంతల విడాకుల అంశంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మహేశ్ బాబు స్పందించారు. మా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తుల‌పై మంత్రి కొండా సురేఖ గారి వ్యాఖ్య‌లు బాధించాయి. సాటి మ‌హిళ‌పై ఒక మ‌హిళా మంత్రి అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం బాధాక‌రం. వాక్ స్వాతంత్య్రం అనేది ఇత‌రుల మ‌నోభావాల‌ను గాయ‌ప‌ర‌చ‌నంత వ‌ర‌కే ఉండాలి. ఇలాంటి నిరాధార‌మైన త‌ప్పుడు ఆరోపణ‌ల‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సినీ ప‌రిశ్ర‌మ‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌ద్ద‌ని ప‌బ్లిక్ డొమైన్‌లో ఉండే వారిని నేను అభ్య‌ర్థిస్తున్నాను. మ‌న దేశంలోని మ‌హిళ‌ల‌తో, సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారితో గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో వ్య‌వ‌హ‌రించాలి అని అన్నారు. 
 
అలాగే, మరో హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ, 'ఏమి జరిగింది, నేటి రాజకీయాలు, రాజకీయ నాయకులు, వారి ప్రవర్తనపై నా ఆలోచనలు, భావాలను మంచి భాషలో వ్యక్తీకరించడానికి కష్టపడుతున్నాను. మన బాగోగులు చూసేందుకు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల గురించి మాట్లాడటానికి, ఉద్యోగాలు, శ్రేయస్సును తీసుకురావడానికి, ఆరోగ్యం గురించి మాట్లాడటానికి, విద్య మరియు సౌకర్యాలను మెరుగుపరచడానికి, మనం ఎదగడానికి వారికి ఓటు వేస్తామని చాలా మంది రాజకీయ నాయకులకు గుర్తు చేయాలనుకుంటున్నాం. ప్రజలుగా మేము దీన్ని అనుమతించలేము లేదా అంగీకరించలేము. రాజకీయాలు ఏ మాత్రం దిగజారకూడదు చాలు' అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు