చిరంజీవి ఆచార్య కోసం భారీ సెట్, 20 ఎకరాల్లో టెంపుల్ టౌన్

శనివారం, 2 జనవరి 2021 (15:25 IST)
అసలే కోవిడ్ రెండో దశ. కొత్త వైరస్ చొచ్చుకుని వస్తోంది. ఈ నేపధ్యంలో సినీ సెలబ్రిటీలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయం కలుగుతోంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగులు కానించేస్తున్నారు. ఎక్కడయినా ప్రత్యేకించి షూటింగ్ చేయాలనుకుంటే మాత్రం ఆ ప్రదేశాన్ని సెట్స్ ద్వారా క్రియేట్ చేసేస్తున్నారు.
 
ప్రస్తుతం ఆచార్య చిత్రం కోసం అదే జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక భారీ చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కోసం వేసిన ఒక భారీ టెంపుల్ టౌన్ సెట్ సరికొత్త రికార్డులకు నాంది పలుకుతుంది. దాని స్పెషల్ ఏంటంటే ఆ సెట్‌ని మేకర్స్ నగర శివార్లలో గల కోకాపేటలో 20 ఎకరాల్లో ఎంతో ఖర్చు పెట్టి నిర్మించారు.
 
ఈ నెల పది నుండి మెగాస్టార్ మీద ఈ సెట్లోనే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఆ తరువాత ఈ సినిమాలో తన తండ్రితో పాటు కలసి నటిస్తున్న రామ్ చరణ్ పైన కూడా కొన్ని సిన్లను తెరకెక్కించనున్నారు డైరెక్టర్ కొరటాల శివ. వాటితో చిరు అండ్ చరణ్ పైన ఒక సాంగ్ కూడా ఇక్కడే చిత్రీకరణ జరుపుకోనుంది.
 
ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది. మాట్ని ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా తాజాగా కరోనా బారిన పడిన రామ్ చరణ్ ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు