యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట విషాదం..

బుధవారం, 27 డిశెంబరు 2023 (15:36 IST)
Bhargavi
టాలీవుడ్ బుల్లితెర మీద యాంకర్ గాయత్రీ భార్గవి ఇంట విషాదం నెలకొంది. బుల్లితెరపై కాకుండా సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ కెరీర్‌లో దూసుకుపోతుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటుంది గాయత్రీ భార్గవి.  గాయత్రీ భార్గవి బాపు గారి మనవరాలు. ప్రస్తుతం పలు షోలు చేస్తూ.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ బిజీగా ఉన్నారు గాయత్రీ భార్గవి.  
 
గాయత్రీ భార్గవి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సూర్య నారాయణ శర్మ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన తాజాగా తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది.  
 
దీంతో పాటు మరో పోస్ట్ లో ఈ ఏడాదిలో ముగ్గురిని పోగొట్టుకున్నాను అంటూ ఎమోషనల్ అయింది ఝాన్సీ. గతంలో ఓసారి భార్గవి మాట్లాడుతూ.. బాపు గారితో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. ప్రముఖ దర్శకులు బాపు గారి మనవరాలిని. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నా గురించి ఎవరికి తెలియదు. నేను కూడా బాపు గారి పేరు ఉపయోగించుకొని పైకి రావాలని అనుకోలేదు... అంటూ చెప్పుకొచ్చింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు