ఆచార్య సెట్లో కొత్త దంపతులు కాజల్-గౌతమ్, మెగాస్టార్ చిరు ఆశీస్సులు

మంగళవారం, 15 డిశెంబరు 2020 (12:41 IST)
డ్రీమ్ గర్ల్ కాజల్ అగర్వాల్ ఇటీవలే గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఆచార్యలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

ఈ నేపధ్యంలో కాజల్ షూటింగులో పాల్గొనేందుకు వచ్చింది. ఆమెతో పాటు ఆమె భర్త గౌతమ్ కూడా వచ్చారు.
కొత్త జంటను మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందించారు. వారితో షూటింగ్ స్పాట్లో కేక్ కట్ చేసి గ్రీటింగ్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాలతో పాటు ఇతర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
ఆచార్య చిత్రం కొణిదెల ప్రొడక్షన్స్ సారథ్యంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు