''తలైవి''గా అప్పుడే వస్తా.. అవన్నీ నమ్మకండి.. కంగనా రనౌత్

మంగళవారం, 13 జులై 2021 (22:50 IST)
నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా పాన్‌ ఇండియా స్థాయిలో తలైవిని దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ముగిసినా థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకోకపోవడంతో ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలవుతుందంటూ ప్రచారం సాగుతోంది. 
 
తాజాగా ఈ విషయంపై స్పందించింది కంగనా. 'ఇప్పటి వరకు తలైవి చిత్ర విడుదల తేదీ ఖరారు కాలేదు. అవాస్తవాల్ని నమ్మకండి. దేశవ్యాప్తంగా థియేటర్లు ఓపెన్‌ అయిన తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం' అని తెలిపింది. ఈ సినిమాలో అరవింద స్వామి, ప్రకాష్‌రాజ్‌, పూర్ణ, మధుబాల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌, బ్రిందా ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు