మెగాస్టార్ చిరంజీవి కరిష్మా ఏమాత్రం తగ్గలేదు. మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెం.150 బాక్సాఫీసు రికార్డులను బద్ధలు కొట్టేస్తోంది. ఖైదీ 150వ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ 3 టిక్కెట్లను అత్యధిక రేటు.. రూ.36 లక్షలకు విక్రయించింది. మొదట టికెట్లను వేలం వేయగా మెగాస్టార్ వీరాభిమాని ఒకరు ఈ మూడు టికెట్లను రూ.36 లక్షలకు చేజిక్కించుకున్నాడు.
ఇదిలా ఉంటే.. 'ఖైదీ నంబర్ 150' సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ట్వీట్ చేశారు. అల్లు అర్జున్, హరీశ్ శంకర్, అల్లు శిరీష్ తదితరులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మోహన్బాబు, అక్కినేని నాగార్జున, రామ్, మంచు మనోజ్ తదితరులు చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.
లెట్స్ డు రికార్డ్స్ కుమ్ముడు అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.
* హరీశ్ శంకర్: 'బాక్సాఫీసులు బద్దలు.. అన్ని ఏరియాలనూ రఫ్ అడిస్తున్న మెగాస్టార్..' అని ట్వీట్ చేశారు.