టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఖలేజా మూవీ రీ-రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రీ-రిలీజ్ అయిన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 8 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో మాత్రమే, ఇది $100K దాటిన మొదటి తెలుగు రి-రిలీజ్ సినిమాగా ఖలేజా నిలిచింది. తద్వారా ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది.
మే 30, 2025న థియేటర్లలో ఖలీజాను రి-రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు దీనిని ఒక పండుగలా జరుపుకున్నారు. కిక్కిరిసిన థియేటర్లు, ప్రత్యేక ప్రదర్శనలతో అదరగొట్టారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబుతో కలిసి అనుష్క శెట్టి నటించిన ఖలేజా సినిమా 2010లో విడుదలైంది. అప్పట్లో పెద్దగా విజయం సాధించకపోయినా, ప్రస్తుతం ఈ సినిమా 15 సంవత్సరాల తర్వాత కూడా హిట్ అయ్యింది.