మహేష్ బాబు సరసన జాన్వీ నటిస్తుందా? త్రివిక్రమ్ ఏం చేస్తారో?

శనివారం, 22 మే 2021 (18:23 IST)
టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా ఎవరు కనిపిస్తారనే దానిపై ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీకపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 
 
జాన్వీ అయితే మహేశ్ సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్..హీరోయిన్ గా జాన్వీకపూర్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
 
ఇప్పటికే పలువురు తెలుగు దర్శక నిర్మాతలు జాన్వీకపూర్ ను టాలీవుడ్ కు పరిచయం చేయాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మరి ఈ సారి త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబినేషన్ కావడంతో జాన్వీకపూర్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయని అనుకుంటున్నారు సినీ జనాలు.
 
రెమ్యునరేషన్ పెద్ద మొత్తంలో ఉంటే జాన్వీ ఈ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. మరి ఇది జరుగుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు