మణిరత్నంకు గుండెపోటా? క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్

శుక్రవారం, 27 జులై 2018 (10:10 IST)
దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల‌లో ఒకరిగా గుర్తింపుపొందిన మణిరత్నం గుండెపోటుకు గురయ్యారనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఫలితంగా మ‌ణిర‌త్నం ఫ్యామిలీ ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మణిరత్నం ప్ర‌స్తుతం "న‌వాబ్" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు. త‌మిళంలో ఇది 'చెక్క చీవంత వాణం' అనే పేరుతో రూపొందుతుంది. అయితే గురువారం సాయంత్రం మ‌ణిర‌త్నంకి గుండెపోటు రావ‌డంతో హుటాహుటిన చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించాని, వైద్యులు మణిరత్నానికి చికిత్స అందిస్తున్నట్టు కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేశాయి. ఇది విన్న అభిమానులు, సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు షాక్ అయ్యారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఆరాలు తీశారు. 
 
ఈ క్ర‌మంలో మ‌ణిర‌త్నం ప్రతినిధులు వివ‌ర‌ణ ఇచ్చారు. సాధార‌ణ వైద్య ప‌రీక్ష‌ల‌లో భాగంగానే ఆయ‌న ఆసుప‌త్రికి వెళ్ళార‌ని, గుండెపోటు వ‌చ్చింద‌నే వార్త‌లు అవాస్త‌వం అంటూ పుకార్ల‌ని కొట్టిపారేశారు. మ‌ణిర‌త్నంకి గుండెపోటు ఏం రాలేద‌ని ప్ర‌తినిధులు చెప్ప‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు