లెజెండరీ యాక్టర్ - బహుముఖ ప్రజ్ఞాశాలి కోట శ్రీనివాస రావు : చిరంజీవి

ఠాగూర్

ఆదివారం, 13 జులై 2025 (10:11 IST)
ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తన సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. లెజండరీ యాక్టర్ - బహుముఖ ప్రజ్ఞాశాని కోట శ్రీనివాస రావు అంటూ కొనియాడారు. కోట శ్రీనివాస రావు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసిందన్నారు. 
 
తాను నటించిన 'ప్రాణం ఖరీదు' చిత్రంలో ఆయనతో కలిసి తాను కూడా ఒకేసారి కెరీర్ ప్రారంభించినట్టు చిరంజీవి గుర్తుచేశారు. ఆ తర్వాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేకశైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారని ఆయన గుర్తు చేశారు. 
 
కామెడీ విలన్, అయినా సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారక్టర్ అయినా, ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత  గొప్పగా నటించి మెప్పించారని తెలిపారు. తాజాగా ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసిందన్నారు. 
 
కోట శ్రీనివాస రావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి, నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నట్టు ఆయన విడుదల చేసిన సందేశంలో పేర్కొన్నారు.  
 
కోట శ్రీనివాస రావు ఇకలేరు... ప్రముఖుల సంతాపం 
 
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాస రావు కన్నుమూశారు. ఆయన వయసు 83 యేళ్లు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1968లో రుక్ష్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్‌  2010 జూన్‌ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 
 
సినిమాల్లోకి రాక ముందు కోట శ్రీనివాసరావు స్టేబ్‌ బ్యాంకులో పనిచేశారు. తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు. ప్రతిఘటన (1985), గాయం (1993),  తీర్పు (1994), లిటిల్‌ సోల్జర్స్‌ (1996), గణేష్ (1998), చిన్న (2000), పెళ్లైన కొత్తలో (2006), ఆ నలుగురు (2004), పృథ్వీ నారాయణ (2002) చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. 
 
2012లో చిత్రం 'వందే జగద్గురుమ్‌' సినిమాకు సైమా అవార్డు అందుకున్నారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దర్శక నిర్మాత క్రాంతికుమార్‌.. వెండి తెరపై కోట శ్రీనివాసరావుకు తొలి అవకాశం ఇచ్చారు. 1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకర్గ భాజపా ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి అరంగ్రేటం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు షించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు