మాల్దీవుల్లో హాయిగా విహరిస్తోన్న చైతూ సామ్.. ఫోటోలు వైరల్

సోమవారం, 23 నవంబరు 2020 (22:13 IST)
Nagachaitanya
నాగచైతన్య, సమంత జంట మాల్దీవుల్లో హాయిగా విహరిస్తోంది. చైతూ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఇన్‌స్టా వేదికగా భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది సామ్‌. తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది తమిళ పొన్ను సమంత. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. 
 
సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. ఆమె ఇటీవల శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96'ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా తర్వాత సమంత ఏ తెలుగు సినిమాలోను కనిపించలేదు. 
 
ఇక సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమేజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన భర్త నాగ చైతన్య ఈరోజు 34పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. 
 
ఈ సందర్భంగా ఈ జంట ప్రస్తుతం మాల్దీవ్స్‌లో సెలెబ్రేట్ చేసుకుంటుంది. అందులో భాగంగా సమంత తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోస్‌ను షేర్ చేసింది. భార్యాభర్తలు మాల్దీవుల్లోని ఉత్తరాదిన ఉన్న ఓ ద్వీపంలో ఉన్నట్టు తెలుస్తోంది. సమంత అక్కడ స్కూబా డైవింగ్‌ కూడా చేశారు. దానికి సంబంధించిన ఓ ఫోటోను సమంత పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు