నేను వస్తున్నా.. ఆశీస్సులు కావాలంటూ నందమూరి మోక్షజ్న ట్వీట్

డీవీ

మంగళవారం, 2 జులై 2024 (12:44 IST)
Nandamuri Mokshajna
నందమూరి బాలక్రిష్ణ వారసుడు నందమూరి మోక్షజ్న సినిమా హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడు? అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొనేది. బాలక్రిష్ణ కూడా పలు సందర్భాల్లో నటన ఇష్టంలేదని అంటున్నాడని చెప్పాడు. కొంతకాలానికి చదువు అయ్యాక చూద్దాం అన్నారు. ఇక నేటితో ఆ మాటలకు ఫుల్ స్టాప్ పడింది. ఎక్స్ (ట్విట్టర్)లో నందమూరి బాలక్రిష్ణ నే వారసుడు వస్తున్నాడు..అంటూ పోస్ట్ చేశాడు. కొద్ది సేపటికే నేను వస్తున్నా.. ఆశీస్సులు కావాలంటూ నందమూరి మోక్షజ్న ట్వీట్ చేస్తూ ఓ ఫొటోను కూడా పెట్టాడు.
 
గతంలో ఓ సారి ఆదిత్య 369 సీక్వెల్ లో మోక్షజ్న ఎంట్రీ వుంటే బాగుంటుందని తన మనసులోని మాటలను బాలక్రిష్ణ వ్యక్తం చేశాడు. అయితే ఆ కథను సింగీతం శ్రీనివాస్ రాసుకోవడానికి సమయం పడుతుందని చెప్పాడని కూడా వార్త వచ్చింది. 
 
చాలా కాలంగా మోక్ఝజ్న ఎంట్రీ కోసం కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం కుటుంబసభ్యులతోనూ సన్నిహితులతో పలు రకాల చర్చలు కూడా బాలక్రిష్ణ జరిపాడని తెలిసింది. ఎన్.టి.ఆర్. కు పరమ భక్తుడు అయిన వై.వి.ఎస్. చౌదరి కూడా తన చేతులమీదుగా ఎంట్రీ ఇప్పించాలని అనుకున్నా కుదరలేదని తెలిసింది. దాంతో కళ్యాణ్ రామ్ అన్న కొడుకు రామారావును నటుడిగా పరిచయం చేస్తున్నాడు. మరి మోక్ఝజ్న ఎంట్రీ ఏ సినిమాకో త్వరలో తెలియనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు