ప్రియుడి కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్న ప్రియురాలు!! (Video)

శనివారం, 26 సెప్టెంబరు 2020 (15:59 IST)
కోలీవుడ్‌ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌లిద్దరూ బెస్ట్ ప్రేమజంటగా పేరుబడ్డారు. వీరిద్దరూ ఇటీవలి కాలంలో ఖాళీ సమయం దొరికితే చాలు చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ముఖ్యంగా, అందమైన పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తున్నారు. 
 
తాజాగా ఈ జంట గోవా పర్యటనకు వెళ్లింది. దర్శకుడు విఘ్నేష్ శివన్ పుట్టినరోజు వేడుకలు ఇటీవల జరుపుకున్నారు. ఈ వేడుకలను నయనతార పట్టుబట్టి మరీ గోవాలో జరిపించారు. ఇందుకోసం చెన్నై నుంచి ఈ ప్రేమ జంట ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో గోవాకు వెళ్లింది. అక్కడ మూడు రోజుల పాటు ఎంజాయ్ చేశారు. ప్రియుడి పుట్టిన రోజు వేడుకలను కూడా నయనతారే స్వయంగా జరిపింది. 
 
ఈ మూడు రోజుల ట్రిప్ కోసం నయన్ ఏకంగా పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందట. ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నయన్, విఘ్నేష్ నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. కెరీర్‌లో అనుకున్నవి సాధించాకనే పెళ్లి చేసుకుంటామని ఇటీవల విఘ్నేష్ వెల్లడించాడు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు