స్టాండప్ కమెడియన్ స్వాతి సచ్దేవా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన తల్లితో చేయకూడని సంభాషణ చేశానని, అదేసమయంలో తాను ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయానని పేర్కొంది. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
కాగా, ఇండియా గేట్ లాటెంట్ వేదికగా యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అలాగే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపైనా కేసులు నమోదయ్యాయి. ఇపుడు జాబితాలో స్వాతి సచ్దేవా చేరింది.