'పద్మావత్‌'కు చిక్కులు... గుజరాత్ మల్టీప్లెక్స్ నిరాకరణ

ఆదివారం, 21 జనవరి 2018 (11:58 IST)
బాలీవుడ్ చిత్రం 'పద్మావత్'కు చిక్కులు తిప్పలేదు. ఈ చిత్ర ప్రదర్శనకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపినప్పటికీ చిత్ర ప్రదర్శనకు నోచుకునేలా కనిపించలేదు. ఈ చిత్రాన్ని తమ రాష్ట్రంలో ప్రదర్శించరాదని గుజరాత్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ నిర్ణయించింది. 
 
మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ నిషేధాజ్ఞలను సుప్రీంకోర్టు పక్కన బెట్టినా కూడా.. మేం గుజరాత్‌లో ఈ సినిమాను ప్రదర్శించరాదని నిర్ణయించాం. ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఏ మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యం కూడా నష్టాన్ని భరించేందుకు సిద్ధంగా లేదు అని గుజరాత్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ డైరెక్టర్ రాకేశ్ పటేల్ తెలిపారు. 
 
రాజ్‌పుత్ కర్ణిసేనతోపాటు గుజరాత్ క్షత్రియ సమాజ్‌కు అనుబంధంగా ఉన్న 10 సంస్థలన్నీ రాష్ట్రంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలను బెదిరిస్తున్నాయి. 'పద్మావత్' సినిమా కేసులో చిత్ర నిర్మాణ సంస్థ తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వేను కొందరు శుక్రవారం ఫోన్‌లో బెదిరించారు. దీనిపై సాల్వే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు