జియో మామికి పవన్‌తో పాటు సూర్య, అనుష్క శర్మ మద్దతు.. చెప్పిందెవరో తెలుసా?

శనివారం, 9 జులై 2016 (17:13 IST)
జియో మామి ముంబై ఫిలిమ్ ఫెస్టివల్‌కు జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. పవన్‌తో పాటు సూర్యకూడా జియో మామికి ఓటేశారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ దేశ వాణిజ్య నగరం ముంబైలో అక్టోబర్ 20 నుంచి  27 మధ్య జరుగనున్న నేపథ్యంలో ముంబై అకాడమీ అఫ్ మూవింగ్ ఇమేజ్ సంస్థ నిర్వహించే ఈ ఫెస్టివల్‌కు పవన్ సపోర్ట్ చేశారు.  
అంతేగాకుండా ఈ సినిమా పండుగకు పవన్ కల్యాణ్ కూడా వస్తున్నట్లు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అనుపమ చోప్రా చెప్పారు. అనుమప చోప్రా ఎవరో తెలుసు కదా .. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల సమయంలో పవన్‌ను ఇంటర్వ్యూ చేశారు.
 
ఆ ఇంటర్వూ దేశ వ్యాప్తంగా పాపులర్ అయినా సర్దార్ దక్షిణాన మాత్రం ఫట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌కు పవన్, సూర్యలు కాకుండా మలయాళ స్టార్ పృధ్వీ రాజ్, రణవీర్ సింగ్, జాన్ అబ్రహం, అనుష్క శర్మ తదితరులు కూడా మద్దతు పలికారు.

వెబ్దునియా పై చదవండి