పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

దేవి

శుక్రవారం, 7 మార్చి 2025 (17:56 IST)
Sushant, Janya Joshi
హిందీ ఎంటర్‌టైనర్ 'పింటు కి పప్పీ' మార్చి 21న హిందీ వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం కన్నడ భాషలలో "కిస్ కిస్ కిస్సిక్" గా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో గ్రాండ్ రిలీజ్ చేయనుంది. ఈ చిత్రం ట్రైలర్ మార్చి 8న విడుదల కానుంది.
 
లవ్, కామెడీ, యాక్షన్‌తో కంప్లీట్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రం పింటు అనే తుంటరి కుర్రాడి ప్రేమ, జీవితంలోని ఊహించని మలుపులను నావిగేట్ చేస్తూ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా వుండబోతోంది. ఎమోషన్, నవ్వులు, సర్ ప్రైజ్ లతో రోలర్‌కోస్టర్‌ గా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
 
నిర్మాత విధి ఆచార్య తన ఉత్సాహాన్ని తెలియజేస్తూ"'పింటు కి పప్పీ' గురించి మేము చాలా గర్వపడుతున్నాము. ఇది అద్భుతమైన తారాగణం, టీంని  ఒకచోట చేర్చింది మేము సృష్టించిన మాయాజాలాన్ని ప్రేక్షకులు ఎక్స పీరియన్స్ చేయడానికి ఎదురుచూస్తున్నాం" అన్నారు.
 
ఈ చిత్రం శుశాంత్, జాన్యా జోషి ,విధిని పరిచయం చేస్తుంది, వీరితో పాటు విజయ్ రాజ్, మురళీ శర్మ, సునీల్ పాల్, అలీ అస్గర్, అజయ్ జాదవ్, పూజా బెనర్జీ, అదితి సన్వాల్, రియా ఎస్. సోని, ఊర్వశి చౌహాన్, ప్యుమోరి మెహతా దాస్, ముక్తేశ్వర్ ఓజా, గణేష్ ఆచార్య వంటి కీలక తారాగణం కూడా ఉంది.
 
విధి ఆచార్య (V2S ప్రొడక్షన్) నిర్మించి, శివ్ హరే రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 21, 2025న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు