థాయ్‌ బాడీ మసాజ్ పేరుతో వ్యభిచారం.. ఎక్కడ?

ఆదివారం, 13 జనవరి 2019 (12:06 IST)
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విజయవాడలో అందమైన అమ్మాయిలతో థాయ్ మసాజ్ పేరుతో గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న వ్యభిచార గుట్టును పోలీసులు రట్టుచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
విజయవాడ పట్టణంలోని పలు బ్యూటీ పార్లర్లలో మసాజ్ ముసుగులో వ్యభిచారం సాగుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ప్రత్యేక బృందం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. 
 
ఈ తనిఖీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన నలుగురు యువతులతో పాటు ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, కేరళకు చెందిన ముగ్గురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పోలీసుల దాడిలో విదేశీ యువతులు పట్టుబడటం ఇదే తొలిసారి.
 
ఈ అమ్మాయిలను పోలీసులు రెస్క్యూ హోంకు తరలించారు. అలాగే, స్పా సెంటర్ల నిర్వాహకులపై ఐపీసీ 370(2), ఐటీపీ చట్టంలోని 3,4 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. పోలీసులు దాడులు నిర్వహించడంతో స్పా సెంటర్లకు విటులను తీసుకొస్తున్న మధ్యవర్తి రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు