బాలీవుడ్ అగ్ర నిర్మాత వికాస్ మోహన్ కన్నుమూత

మంగళవారం, 31 మే 2016 (14:44 IST)
ప్రముఖ బాలీవుడ్ చిత్రాల అగ్ర నిర్మాత, ట్రేడ్ ఎనలిస్ట్ వికాస్ మోహన్ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం ఆయనకి గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన క్లిటికేర్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. 
 
వికాస్ మాధురీదీక్షిత్, అక్షయ్ కుమార్ నటించిన అర్జూ (1999) చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతగానే కాకుండా పలు చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించారు. ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నామని కుటుంబసభ్యులు తెలిపారు. వికాస్ మృతిపై బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి